telugu navyamedia
రాజకీయ

తక్కువ చార్జీలతో.. ప్రత్యేక రైళ్లు.. ఇవే…

Attack Railway TTI in Danapur express

పెద్దపండుగ సందర్భంగా ఉద్యోగస్తులు అందరూ పల్లెలబాట పట్టడంతో, రవాణా వ్యవస్థకు డిమాండ్ వచ్చేసింది. ఎంతగా ముందస్తు రిజర్వేషన్ లు పెట్టినా చివరాఖరి రోజు ప్రయాణాలు పెట్టుకునే వారూ ఎక్కువగానే ఉన్నారు. దీనితో ప్రైవేట్ బస్సులు విపరీతంగా టికెట్ రేట్లను పెంచేశాయి. దీనికి రైల్వే కొత్త పరిష్కారం తెచ్చింది. అందుకే, సామాన్యులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను వినిపించింది. రద్దీ దృష్ట్యా, 7 జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాల మధ్య నేటి నుంచి తిప్పనుంది. సాధారణ రైలు చార్జీలతో ఈ రైళ్లలోని ఏ బోగీలో అయినా కూర్చుని ప్రయాణించవచ్చు.

సికింద్రాబాద్ – విజయవాడ మధ్య (07192) నేటి మధ్యాహ్నం 12 గంటలకు, విజయవాడలో నేటి రాత్రి 8.25 కు హైదరాబాద్ కు (07193) రైలు బయలుదేరుతాయి. నేటి మధ్యాహ్నం మరో రైలు (07194) 1.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఇదే రైలు విజయవాడలో (07195) రేపు ఉదయం 8.35కు సికింద్రాబాద్ కు బయలుదేరుతుంది. నేటి సాయంత్రం కాకినాడ టౌన్ నుంచి తిరుపతికి (07191) సాయంత్రం 6.45కు ఓ రైలు బయలుదేరుతుంది. రాత్రి 9.10 గంటలకు (07184) రైలు విజయవాడ నుంచి విజయనగరానికి బయలుదేరుతుంది. విజయనగరం నుంచి ఇదే రైలు (07185) రేపు ఉధయం 7.45కు విజయవాడకు బయలుదేరుతుంది. ఇక ఈ రైళ్లలో సికింద్రాబాద్ నుంచి విజయవాడకు రూ. 130, విజయవాడ నుంచి హైదరాబాద్ కు రూ. 135, కాకినాడ నుంచి తిరుపతికి రూ. 175, విజయనగరం, విజయవాడ మధ్య ప్రయాణానికి రూ. 145 రూపాయల టికెట్ ధరను నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు.

Related posts