తేదేపా కార్యకర్తలు చంద్రబాబు నాయుడు అనే పేరే ఒక బ్రాండ్ అని చెప్పుకుంటారు. అడ్మినిస్ట్రేటర్ గా కష్టించి పనిచేసే వ్యక్త త్వంగల రాజకీయ నాయకుడిగా, జాతీయ నాయకుడిగా సుపరిచితమైన పేరిది. కానీ ఈసారి సీఎం అయినప్పటి నుండి దాదాపు 35 ఏళ్లు కష్టపడి సంపాదంచుకున్న పేరు మొత్తం సంద్రంలో కలుస్తున్నట్లుంది నాయుడిగారి పరిస్థితి. ఒక మాట అనడం – దానికి విరుద్దంగా ప్రవర్తించడం – మళ్లా ఆ మాటకు నాకు ఏమీ సంబంధం లేదనడం – చివరాఖరుకి తూచ్ ఇదంతా కాదు ముందు చెప్పిందే ఆఖరు మద్యలో నేను చెప్పిందాంతో నాకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం – ప్రజల్ని మభ్య పెట్టాలనుకోవడం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వంలో ఉన్న తెలుగు దేశం ప్రభుత్వానికి పరిపాటయినాయి.
ఇక ప్రత్యేక హోదా గురించి బాబు గారు వేసిన పిల్లిమొగ్గలు ఎన్నెన్నో? ఎవరు చేసిన ఖర్మ వారే అనుభవిస్తారు అన్నట్లుగా.. ఆ పిల్లిమొగ్గలే ఆయనను ప్రజలే నిలదీసే విధంగా చేయబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశలకులు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అలనాడు హోదా వద్దు..ప్యాకేజినే ముద్ద అంటూ లిఖిత పూర్వకంగా ఇచ్చిన ఏపీ ప్రభుత్వ పత్రాల నఖలు బయట పెట్టారు. బీజేపీ రాజకీయ వ్యూహాలు సమయం చూసి అమలు చేస్తుంది.