క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఛార్మీ కౌర్, కరణ్ జోహార్తో కలిసి పూరి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ మారిందని టాక్. అయితే… ఈ చిత్రానికి చివరగా ‘లైగర్’ టైటిల్ ఖాయం చేశారు. ఈ మధ్యనే ఈ మూవీ టైటిల్ ను ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం బాక్సింగ్ స్టేజ్కు సంబంధించి ఓ కొత్త సెట్ను ఏర్పాటు చేస్తున్నారట. దీనిని హైదరాబాద్లోని నానక్రామ్గూడా వద్ద రామానాయుడు స్టూడియోస్తో ఏర్పాటు చేస్తున్నారట. ఈ సినిమా చిత్రీకరణను మార్చి నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ సెట్లో కొన్న ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ పునఃప్రారంభానికి కావలసిన ఏర్పాట్లను మొదలుపెట్టారట. ఇప్పటికే సగం వరకు ఈ సినిమా పూర్తి కావడంతో మిగతా సినిమాను కూడా కుదిరినంత త్వరగా పూర్తి చేస్తున్నారని భావిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి విజయ్ వారి అంచనాలను ఎంత వరకు అందుకుంటాడో వేచి చూడాలి.
previous post