telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సూచనలు చేయడం వరకే ఎస్ఈసీ పరిధి: స్పీకర్ తమ్మినేని

ap speaker tammineni

ప్రభుత్వానికి సూచనలు చేయడం వరకే రాష్ట్ర ఎన్నికల కమిష (ఎస్ఈసీ) పరిధి ఉంటుదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో విమర్శల దాడి జరుగుతోంది.

తాజాగా ఈ అంశంపై తమ్మినేని స్పందించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం, విధివిధానాలు అమలు చేయడం వరకే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాత్ర ఉంటుందని, ఇతరత్రా విపత్తులు ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగంతో సంప్రదించి, ప్రభుత్వ సూచనల మేరకే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.రాష్ట్ర పాలనలో ఎన్నికల కమిషనర్ జోక్యం చేసుకుంటే సీఎం ఎందుకని అన్నారు.

Related posts