గవర్నర్ తమిళిసై సౌందర రాజన్కు తెలంగాశాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సర్ ప్రైజ్ ఇచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ తమిళిసై రాజ్భవన్ నుంచి ఫోన్ఇన్ ద్వారా ప్రజలతో మాట్లాడారు. ఊహించని విధంగా స్పీకర్ పోచారం కూడా నేరుగా గవర్నర్కు ఫోన్చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ కాల్చేయడంతో ఆశ్చర్యపోయిన గవర్నర్ కూడా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షతు తెలిపారు. కాగా ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం రోజున రాజ్భవన్లో ఓపెన్హౌస్ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, సాధారణ ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి హాజరై గవర్నర్ను కలిసే అవకాశం కల్పించేవారు.కానీ ఈసారి కోవిడ్-19 కారణంగా ఓపెన్హౌస్ను రద్దుచేశారు.దానికి బదులుగా నేరుగా గవర్నర్ ఫోన్ఇన్ ద్వారా ప్రజలతో మాట్లాడారు. శుక్రవారం ఉదయం 10గంటలకు ఫోన్ ఇన్ను ప్రారంభించగా నిరవధికంగా కాల్స్ వచ్చినట్టు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. దాదాపు ఒక్క గంటలో 60 కాల్స్ వచ్చినట్టు తెలిపారు. అన్ని రంగాల ప్రముఖులు, సాధారణ ప్రజలు ప్రత్యేకించి పిల్లల నుంచి ఎక్కువ కాల్స్ వచ్చినట్టు చెప్పారు. కేవలం రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోనిఇతర ప్రాంతాల నుంచి కూడా కాల్స్ వచ్చాయి. కాగా గవర్నర్ తెలుగు, తమిళం, ఇంగ్లీష్, హిందీలో మాట్లాడారు. చాలా మంది కాలర్స్ తమ సమస్యలను కూడా గవర్నర్కు విన్నవించారు. ఇందులో ప్రైవేట్టీచర్స్, ఇంజనీరింగ్కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్, వారి సమస్యలను వివరించారు. అయతే రాతపూర్వకంగా రాజ్భవన్కు ఫిర్యాదులు పంపితే తగిన చర్యలు తీసుకుంటామని ఈసందర్భంగా గవర్నర్ వారికి హామీ ఇచ్చారు.
previous post