పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకమీదట సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ ల భద్రతను ఎస్పీ ర్యాంకు అధికారులు పర్యవేక్షించనున్నారు. జవాన్ల తరలింపు ప్రక్రియ యావత్తు ఎస్పీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు.అంతేకాకుండా, కాన్వాయ్ ల వెంట భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, సైని వాహనాల సంఖ్యను మరింత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
మరింత మెరుగైన రక్షణ కల్పించేందుకు వీలుగా ఒక్కో కాన్వాయ్ లో 40కి మించి వాహనాలు అనుమతించరాదని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రం సరికొత్త ప్రామాణిక కార్యాచరణ విధానం (స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోగ్రామ్-ఎస్ఓపీ) రూపొందించింది.