గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఎస్పీ చరణ్ తాజాగా వీడియో మెసేజ్ను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మీ ప్రార్థనలు వృథాగా పోవు. దేవుడు ఉన్నాడు. నాన్న ఆరోగ్యంతో తిరిగి వస్తారని నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను’’ అంటూ వణుకుతున్న గొంతుతో చరణ్ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తాయి. కాగా బాలు త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆగస్టు 20న సాయంత్రం 6 గంటలకు తమిళ సినీ పరిశ్రమతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎస్పీ బాలు అభిమానులు సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు.
కాగా, కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చేరారు. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన ఎస్పీ బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు నుంచి ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఆయనకు వెంటిలేటర్ను తొలగించి ఈసీఎంవో (ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సపోర్ట్తో చికిత్స అందిస్తున్నారు.