దిగ్గజ గాయకుడు, గాన గాంధర్వుడు, సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూయడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సుమారు 50 రోజులు మృత్యువుతో పోరాడిన బాలు.. శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ అధికారికంగా ప్రకటించారు. కాగా బాలు పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని సత్యం థియేటర్ వద్ద ఉంచనున్నారు. ఇప్పటికే సత్యం థియేటర్ పార్కింగ్ ప్లేస్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం నుంచి అభిమానులను బాలు పార్థివదేహం సందర్శనకు అనుమతించనున్నారు. మరోవైపు, బాలు అంత్యక్రియలను ఆయన ఫామ్ హౌస్లో నిర్వహించనున్నట్టు సమాచారం. అక్కడ కూడా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. సోషల్ మీడియా ద్వారా కోట్లాది మంది అభిమానులు సంతాపం వ్యక్తంచ చేస్తున్నారు.
ఇళయరాజాపై నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు