ప్రస్తుతం మన దేశాన్ని కరోనా ఇంకా వణికిస్తోంది. అయితే ఈ వైరస్ కారణంగా దూర ప్రాంతాలకు వెళ్లే వారి పరిస్థితి దారుణంగా తయారైపోయింది. రెగ్యులర్ సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన పరిస్థితి లేదు.. ఇక, ఇదే సమయంలో.. దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.. ఈ నెల 21 తేదీ నుంచి జులై 1వ తేదీ వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది సౌత్ సెంట్రల్ రైల్వే.. ఈ నెల 21వ తేదీ నుంచి 30 వరకు విశాఖపట్నం-కాచిగూడ (08561), విశాఖపట్నం-కడప (07488), విశాఖపట్నం-లింగంపల్లి (02831) రైళ్లను రద్దు చేసిన ఎస్సీఆర్.. ఈ నెల 22 నుంచి జులై 1 వరకు కాచిగూడ-విశాఖపట్నం (08562), కడప-విశాఖపట్నం (07487), లింగంపల్లి-విశాఖపట్నం (02832) రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్టు తన ప్రకటనలో పేర్కొంది. చూడాలి మరి మళ్ళీ ఇవి ఎప్పుడు ప్రారంభం అవుతాయి అనేది.
previous post