telugu navyamedia
సినిమా వార్తలు

నీ కొడుకు వచ్చేదాకా తాళి కట్టను అన్నాడు : సౌందర్య రజినీకాంత్

Soundarya-Rajinikanth

రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ ఇటీవలే రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె 2010లో అశ్విన్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నాలుగేళ్లకు కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుంది ఈ జంట. అయితే అప్పటికే వీరికి వేద్ అనే ఓ కుమారుడు ఉన్నాడు. ఆ తరువాత ప్రముఖ నటుడు విశాగన్ వనగమూడిని రెండో వివాహం చేసుకున్నారు సౌందర్య రజినీకాంత్. అయితే తాజాగా ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో తన రెండో వివాహం సందర్భంలో జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనలను ఆమె మీడియాతో పంచుకున్నారు.

మొదట వేద్‌కి విశాగన్ ఫొటో చూపించి “ఇదిగో మీ డ్యాడీ” అని చెప్పగా వేద్ చాలా సంబరపడిపోయాడని, కానీ పెళ్లి మండపంలో కూర్చున్నపుడు ముహూర్తం దగ్గర పడుతున్నా ఇంకా వేద్ రాకపోవడంతో తాను బాగా టెన్షన్ పడ్డానని, ఆ సందర్భంలో వేద్ వచ్చేదాకా నేను తాళికట్టనని విశాగన్ తనకు ధైర్యం చెప్పారని ఆమె తెలిపారు. అంతేకాదు పెళ్లికి ముందు “మీ అమ్మను నేను పెళ్లి చేసుకోసుకోవడం నీకిష్టమేనా?” అని వేద్ వద్ద విశాగన్ అనుమతి కూడా తీసుకున్నాడని, విశాగన్‌ వద్ద ఉంటే వేద్‌ సురక్షితంగా ఉంటాడనే నమ్మకం తనకుందని సౌందర్య రజినీకాంత్ చెప్పుకొచ్చారు.

Related posts