అక్షయ్, రోహిత్ శెట్టి కాంబినేషన్లో ‘సూర్యవంశీ’ అనే సినిమా రాబోతోంది. ఇందులో అక్షయ్ పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నారు. కత్రినా కైఫ్ కథానాయికగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి రోహిత్, అక్షయ్కు మధ్య ఏవో మనస్పర్ధలు వచ్చాయట. దాంతో ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారని, నిర్మాత కరణ్ జోహార్ వీరిని కలపాలని చూస్తున్నారని బాలీవుడ్ లైఫ్ వార్త రాసింది. దీనిపై అక్షయ్ తనదైన శైలిలో స్పందించాలని అనుకున్నారు. ఇందుకోసం కత్రినా కైఫ్, రోహిత్ శెట్టి, అక్షయ్ ఓ ప్లాన్ వేశారు. ‘బ్రేకింగ్ న్యూస్: అక్షయ్ కుమార్, రోహిత్ మధ్య గొడవలు’ అని రాసున్న వార్త ఫొటోను కత్రినా వీడియోలో చూపించారు. ఆ తర్వాత అక్షయ్, రోహిత్ చొక్కా పట్టుకుని కొట్టుకుంటున్నట్లు యాక్ట్ చేశారు. ఆ తర్వాత సెట్లో పోలీస్ కానిస్టేబుల్ పాత్రల్లో నటిస్తున్నవారు వచ్చి వారిని అదుపు చేసినట్లు, ఆ తర్వాత వారిద్దరూ అలసిపోయి పడిపోయినట్లు ఫన్నీ వీడియోను రికార్డ్ చేశారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని ఈ విధంగా స్పష్టం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అక్షయ్ కుమార్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ను అందరూ మెచ్చుకుంటున్నారు. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న నాలుగో పోలీస్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా ఇది. ఇందులో అజయ్ దేవగణ్, రణ్వీర్ సింగ్ కూడా అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత కత్రినా, అక్షయ్ కలిసి నటిస్తున్న సినిమా ఇది.
#BreakingNews – A fallout which might just make your day 🙃 pic.twitter.com/gH2jgTQqhT
— Akshay Kumar (@akshaykumar) 12 November 2019
నీరే జీవనానికి ఆధారం… కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం: నాగార్జున