telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

రెండో పెళ్లి వద్దన్నకొడుకులు ..ఉరేసుకొని తండ్రి ఆత్మహత్య!

Crime

కొడుకులు రెండో పెళ్లి వద్దన్నారని మనస్తాపం చెంది వృద్ధాప్యంలో ఉన్న ఓ తండ్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన  ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో చోటుచేసికొంది. కాన్షీరాం కాలనీలో అర్షద్(75) నివాసం ఉంటున్నారు. అర్షద్ కు ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అమ్మాయిలకు ఆయన పెళ్లిళ్లు చేసేశారు. ప్రస్తుతం ముగ్గురు కుమారులు తండ్రితో కలిసి ఉంటున్నారు.

కొన్నేళ్ల క్రితం అర్షద్ మొదటి భార్య చనిపోయింది. ఓవైపు వయసు మీదపడటం, ఇంట్లో ఎవ్వరూ తోడు లేకపోవడంతో రెండో పెళ్లి చేసుకోవాలని అర్షద్ భావించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కుమారుడు పరువు పోతుందని గొడవకు దిగారు. ఈ సందర్భంగా వీరి మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. దీంతో తండ్రి అర్షద్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసికొని ధర్యాప్తు చేస్తున్నారు.

Related posts