telugu navyamedia
రాజకీయ వార్తలు

నిజమైన స్వేచ్ఛను కాపాడేందుకు .. ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి … : సోనియాగాంధీ

sonia and priyanka gandhi in raebareli

నిజమైన స్వేచ్ఛను కాపాడేందుకు, అన్యాయం, అసహనం, వివక్షకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోనియా మాట్లాడుతూ సత్యం, అహింస, కరుణ, దేశభక్తి వంటి వ్యవస్థాపక సూత్రాలతో భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు సాగిందన్నారు.

దేశంలో మూర్ఖత్వం, నమ్మకం, మతోన్మాదం, జాత్యాహంకారం, అసహనం, అన్యాయానికి ఇదివరకు చోటు లేదని, అయితే ప్రస్తుతం ప్రజలు ప్రతిరోజూ వీటిని ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం అనేకమంది వీరుల త్యాగాల ఫలితమని గుర్తు చేస్తూ, స్వేచ్ఛ, సోదరభావం, శాంతి, సమానత్వపు విలువలు పరిరక్షించాలని సోనియా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Related posts