telugu navyamedia
రాజకీయ వార్తలు

సోనియా అధ్యక్షతన విపక్షాల సమావేశం..మూడు పార్టీలు డుమ్మా!

sonia will decide team lead in haryana

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన ఈరోజు ఢిల్లీలో విపక్ష పార్టీల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ, అఖిలేశ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ, కేజ్రీవాల్ కు చెందిన ఆప్ హాజరుకావడం లేదు. ఈ వారం ప్రారంభంలో మొత్తం 18 పార్టీలకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వెళ్లింది.

మరికొద్ది సేపట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరగనుంది. కరోనా వైరస్ ను కేంద్రం హ్యాండిల్ చేస్తున్న విధానం, రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మమతా బెనర్జీ, స్టాలిన్, హేమంత్ సొరేన్, శరద్ పవార్ పార్టీలతో పాటు వామపక్షాలు, యూపీఏ భాగస్వామ్య పార్టీలు ఈ సమావేశానికి హాజరుకానున్నాయి.

Related posts