telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన 8 ఏళ్ల బాలుడు

New couples attack SR Nagar

తన తండ్రిపై ఎనిమిదేళ్ల ఓ బాలుడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వర్ని మండలంలోని ఒడ్డేపల్లి గ్రామానికి చెందిన 8 ఏళ్ల మహేష్‌ అనే బాలుడు తన తండ్రి శివ నిత్యం తనను కొడుతూ, వేధిస్తున్నాడని వర్ని పోలీసుల ముందు కన్నీరుపెట్టాడు. వివరాలు తెలుసుకున్న ఎస్సై అనిల్‌ రెడ్డి బాలుడి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. మీ మధ్య ఏమైనా గొడవలుంటే పిల్లలపై మీ ప్రతాపం చూపిస్తారా.. అంటూ ఆయన వారిపై మండిపడ్డారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకూడదనీ, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరించారు.

Related posts