telugu navyamedia
రాజకీయ వార్తలు

ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన సోము వీర్రాజు

somuverraju venkaiah

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తొలిసారి ఢిల్లీలో కలిశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తనను ప్రకటించిన తర్వాత ఉపరాష్ట్రపతి గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందని ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.

మరోవైపు బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ ను కూడా సోము వీర్రాజు కలిశారు. ఈ భేటీకి సంబంధించి ఆయన ట్వీట్ చేస్తూ, ‘రామ్ మాధవ్ ను ఎప్పుడు కలిసినా ఒక గొప్ప వ్యక్తితో నాకు మంచి అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంటుంది. పార్టీ గురించి ఆయనకు ఉన్న విజన్ నాకు స్ఫూర్తిదాయకం’ అని పేర్కొన్నారు.

Related posts