ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సమీపంలోని ది వెన్యూ ఫంక్షన్ హాల్లో పలువురు బీజేపీ నేతల మధ్య ఆయన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ఆలోచనా విధానలే రాష్ట్ర ప్రగతికి తోడ్పడుతాయని అన్నారు. ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాల్సిన బాధ్యత బీజేపీ, జనసేనకి ఉందన్నారు. అభివృద్ధి అనేది బీజేపీ లక్ష్యమని అన్నారు. ప్రపంచ దేశాల్లో గొప్ప దేశంగా భారత్ను తీర్చిదిద్దడమనేది బీజేపీ ధ్యేయమని తెలిపారు.
దేశంలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. తెలుగు వారు ప్రపంచ దేశాల్లో గొప్ప స్థానాల్లో ఉన్నారు. ఏపీలో మానవ వనరులను రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో వినియోగించాలి. అందుకోసం బీజేపీ అధికారంలోకి రావడం చాలా ముఖ్యమన్నారు.
ఎన్నికల్లో ఈ అంశాన్ని తెలుపుతూ ఏపీలో ముందుకు వెళతాం’ అని సోమువీర్రాజు చెప్పారు. దేశంలో బీజేపీ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం అందించిందని వీర్రాజు తెలిపారు.
నాయకుల స్వార్థంతో రాజధాని మార్చాలని నిర్ణయం: యనమల