telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజలకు క్షమాపణ చెబితే గౌరవం.. బొత్స వ్యాఖ్యల పై సోమిరెడ్డి ఫైర్

somireddy brother into ycp today

రాజధాని అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ నెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో పర్యటించనున్న నేపథ్యంలో ‘రాజధాని శ్మశానాన్ని చూసి ఏడవడానికి వస్తున్నావా బాబూ’ అంటూ బొత్స వ్యాఖ్యలు చేశారు.

దేశం గుర్తించిన అమరావతిని శ్మశానంతో పోల్చడం బొత్స దిగజారుడుతనానికి నిదర్శనమని సోమిరెడ్డి విమర్శించారు. చిన్న పల్లెను కూడా ఆ విధంగా పోల్చడానికి ఎవరికీ మనసు రాదని అన్నారు. జరుగుతున్న పనులను ఆపేసి, రాజధానిని నిర్వీర్యం చేసి, ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెపితే గౌరవంగా ఉంటుందని సోమిరెడ్డి సూచించారు.

Related posts