ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు మంత్రులు ఓటమి అంచున ఉన్నారు. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి ఐదోసారి భారీ షాక్ తగిలింది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘన విజయం సాధించారు.
కాగా, సోమిరెడ్డికి ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటి వరకూ వరుసగా ఐదుసార్లు ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల్లో ఓడిన చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అయి చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఎన్నికలకు ముందు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే అభర్తిగా బరిలోకి దిగారు. ఇదిలా ఉంటే ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఓట్ల లెక్కింపులో బాగా వెనుకబడి ఉండగా, తాజాగా సోమిరెడ్డి ఓటమిపాలయ్యారు.