కెనడాలో శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య జరిగిన కారు ప్రమాదంలో చనిపోయాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ మేరకు అశ్విన్ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘సనత్ జయసూర్య గురించి వచ్చిన వార్త నిజమేనా? అది వాట్సాప్ ద్వారా నాకు తెలిసింది. అయితే ట్విట్టర్లో ఎక్కడా ఆ ప్రస్తావన కనిపించలేదు’ అని ఆరా తీశాడు.
ఈ వార్తతో .. వరుసగా ఎంతో మంది జయసూర్యకు ఫోన్లు చేయడం..వాట్సాప్ చేయడం జరుగుతుందని ఆవేదన చెందాడు జయసూర్య. తనకేం కాలేదని, ఎందుకిలా లక్షణంగా బతికి ఉన్నవారిని ఇలా దారుణంగా చంపుతారు..మీ రేటింగ్స్ కోసం ఇతర మనోభావాలతో ఆడుకోవడం ఎంత వరకు న్యాయం అని.. ఇలాంటి తప్పుడు వార్తలతో తన కుటుంబ సభ్యులను బాధ పెట్టవద్దని కోరాడు.