దేశ వ్యాప్తంగా మూడో విడుత లోక్సభ ఎన్నికల్లో ఈరోజు ఓ పోలింగ్ కేంద్రంలో పాము కలకలం సృష్టించింది. కేరళలోని కన్నూరు పోలింగ్ కేంద్రంలోని ఓ వీవీప్యాట్ లో పామును చూసి ఒక్కసారిగా ఓటర్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.విషయం తెలుసుకున్న అధికారులు పాములు పట్టే ఓ వ్యక్తి సాయంతో ఈ పామును వీవీప్యాట్ నుంచి తొలగించారు. దీంతో కొద్దిసేపు పోలింగ్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. అనంతరం పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
previous post
next post