సోషల్ మీడియాలో కొంతమంది కావాలని ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. కావాలనే అవతలి వారి మనసులను బాధ పెడుతుంటారు. తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ స్పందిస్తూ “నిన్న పోస్టు చేసిన నా కుమార్తె ఫోటోను డిలీట్ చేశాను. ఫోటోలో ఆమె అలా చూస్తుండడంపై తన క్లాస్లోని ఓ ఇడియట్ ఆమెను ఎగతాళిచేశాడు. తన తల్లి ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఆమె ఎలా చూస్తున్నదో చెప్పాలంటూ తన తోటి విద్యార్ధులను కూడా రెచ్చగొట్టాడు. దీంతో ఆ ఫోటోను చూపిస్తూ తనను ఏడిపిస్తున్నారనీ.. దాన్ని డిలీట్ చేయాలని నా కుమార్తె కోరింది. ఆమె కంటతడి పెట్టడం ఇష్టంలేక నేను అందుకు అంగీకరించాను. అయితే ఆ ఫోటో డిలీట్ చేయడం వల్ల ఆకతాయికి మరింత బలాన్ని ఇచ్చినట్టవుతుందని తర్వాత నాకు అనిపించింది. కాబట్టి అతడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే… నా కుమార్తె మంచి క్రీడాకారిణి. లిమ్కా బుక్స్లో కూడా చోటు సంపాదించింది. కరాటేలో సెకండ్ డాన్ బ్లాక్ బెల్ట్ కూడా సాధించింది. వరల్డ్ చాంపియన్షిప్లో రెండు సార్లు కాంస్య పతకం కూడా గెలుచుకుంది. మంచి కూతురు. చాలా అందంగా కూడా ఉంటుంది. మీరు ఎంత ఏడ్పించినా ఆమె తిరిగి పోరాటం చేయగలదు. ఆమె జోయిష్ ఇరానీ. ఆమెకు తల్లినైనందుకు గర్విస్తున్నా…” అని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
previous post
next post
రెడ్డి క్యాస్ట్ కాదు అదొక ఒక టైటిల్..మాజీ ఎంపీ తులసి రెడ్డి సంచలన వ్యాఖ్యలు