telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

స్మార్ట్ ఫోన్ పోయిందని మనస్తాపం..ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య!

suicide attempt cc

ఇటీవల కొందరు యువకులు స్మార్ట్ ఫోన్ పైనే ఎక్కువగా గడుపుతున్నారు. మార్కెట్ లోకి కొత్త మాడల్స్ వచ్చినప్పుడల్లా ఖరీదైన ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. ఖరీదైన స్మార్ట్ ఫోన్ పోవడంతో ఓ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మాచారెడ్డి మండలం ఎస్సీ కాలనీలో అశోక్(17) అనే యువకుడు తల్లి జయమ్మతో కలసి ఉంటున్నాడు. ఇద్దరూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఇటీవల దాచుకున్న డబ్బులతో అశోక్ ఓ ఖరీదైన స్మార్ట్ ఫోన్ ను కొన్నాడు. అయితే దాన్ని పొగొట్టుకున్నాడు. దీంతో తీవ్రమనస్తాపానికి లోనైన అశోక్, కుడిచేతిని బ్లేడుతో కోసుకున్నాడు. వెంటనే తల్లి, ఇరుగుపొరుగువారు అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న అశోక్ ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో అశోక్ తల్లి జయమ్మ శోకసంద్రంలో మునిగిపోయింది.

Related posts