భారత యువ ఆల్రౌండర్ శివమ్ దూబె తాను కోరుకోని ఓ రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులిచ్చిన రెండో బౌలర్గా అవతరించాడు. న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి పోరులో అతడు ఏకంగా 34 పరుగులు ఇచ్చాడు. ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (36) తర్వాత స్థానంలో నిలిచాడు. టిమ్ సీఫెర్ట్, రాస్ టేలర్ కలిసి అతడి బౌలింగ్ను ఊచకోత కోశారు. ఆఖరి టీ20లో శివమ్ దూబె పదో ఓవర్ విసిరాడు. తొలి బంతిని సీఫెర్ట్ మిడ్వికెట్ మీదుగా సిక్సర్గా మలిచాడు. నెమ్మదిగా వేసిన రెండో బంతికీ అదే శిక్ష విధించాడు. ఇన్సైడ్ ఎడ్జ్ అయిన మూడో బంతి కీపర్ మీదుగా బౌండరీకి చేరింది. నాలుగో బంతికి సింగిల్ వచ్చింది. రాస్టేలర్ స్ట్రైక్ తీసుకున్నాడు.
ఐదో బంతి నోబాల్. టేలర్ దానిని బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత వచ్చిన ఫ్రీహిట్ను బలంగా బాది సిక్సర్గా మలిచాడు. ఆఖరి బంతినీ డీప్ స్క్వేర్ మీదుగా స్టేడియం దాటించాడు. దీంతో ప్రత్యర్థికి జట్టుకు 34 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత శివమ్ చేతికి రాహుల్ బంతి ఇవ్వలేదు. ఒక ఓవర్లో ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్లు… 36 – స్టువర్ట్ బ్రాడ్ (2007 దర్బన్లో భారత్తో); 34 – శివమ్ దూబె (2020 మౌంట్ మాంగనూయ్లో న్యూజిలాండ్తో); 32 – వేన్ పర్నెల్ (2012 ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లాండ్తో); 32 – ఇజతుల్లా దౌలత్జాయ్ (2012 కొలంబోలో ఇంగ్లాండ్తో); 32 – స్టువర్ట్ బిన్నీ (2016 లాడర్హిల్లో వెస్టిండీస్తో); 32 – మాక్స్ ఓడౌడ్ (2019 డబ్లిన్లో స్కాట్లాండ్తో).