ప్రకాశ్ పులిజాల దర్శకత్వంలో ప్రియమణి కీలక పాత్ర పోషించిన చిత్రం “సిరివెన్నెల”. కమల్ బోరా, ఏఎన్బాషా, రామసీత నిర్మాతలు. ‘మహానటి’ ఫేమ్ సాయి తేజస్విని టైటిల్ పాత్ర పోషిస్తోంది. శనివారం ఈ చిత్రం పాటల్ని హైదరాబాద్లో విడుదల చేశారు. కె.రాఘవేంద్రరావు, ఎం.ఎం.కీరవాణి బిగ్ సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ “ప్రియమణి… సావిత్రిలాంటి పాత్రలూ చేయగలదు. మోడ్రన్ పాత్రలతోనూ మెప్పించగలదు. సతీ సావిత్రిలాంటి డివోషనల్ పాత్రలకూ న్యాయం చేయగలదు. తనలో ఆ పొటెన్షియల్ ఉంది. ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ చేయడంతో ఆమెలోని కొత్తకోణం బయటకు రానుంది. కీరవాణి దగ్గర మ్యూజిక్ కో-ఆర్టినేటర్గా పని చేసిన బాషాతో చాలా కాలంగా అనుబంధం ఉంది. ఈ సినిమాతో ఆయన నిర్మాతగా మారడం ఆనందంగా ఉంది” అని అన్నారు. ప్రియమణి మాట్లాడుతూ “ఈ సినిమాతో నాకు సెకండ్ ఇన్నింగ్ మొదలైంది. ప్రకాశ్గారు కథ చెప్పినదానికన్నా బాగా తెరకెక్కించారు. ట్రైలర్ నచ్చింది” అని చెప్పారు. దర్శకుడు ప్రకాశ్ మాట్లాడుతూ “‘చక్కని హారర్ థ్రిల్లర్ ఇది. సిరివెన్నెలగా ఎవరు చేస్తే బావుంటుందని ఆలోచిస్తునప్పుడు రాజేంద్రప్రసాద్గారి మనవరాలు తేజస్విని గుర్తుకొచ్చింది. తను చాలా బాగా నటించింది” అని అన్నారు. వైవీఎస్ చౌదరి, రాజేంద్రప్రసాద్, ఆర్.పి.పట్నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ఆసక్తికరంగా సాగుతోంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
వ్యభిచారం తప్పుకాదు… శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు