నితిన్, రష్మిక మందన్న, వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఫిబ్రవరి 21న విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. నేడు వేలంటైన్స్ డే సందర్భంగా చిత్రం నుండి “సింగిల్స్ యాంథమ్” అనే రొమాంటిక్ సాంగ్ విడుదల చేశారు. ఇందులో నితిన్ లుక్ డిఫరెంట్గా ఉంది. గీత రచయిత శ్రీమణి సాహిత్యానికి, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ స్వరాలూ సమకూర్చగా, గాయకుడు అనురాగ్ కులకర్ణి గాత్రంలో ప్రాణం పోసుకుందీ పాట.’ తాజాగా విడుదలైన వీడియో సాంగ్పై మీరు ఓ లుక్కేయండి.
కొన్నాళ్ళుగా సరైన హిట్ లేక సతమతమతున్న నితిన్ ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. గతంలో నితిన్ దశాబ్ద కాలం పాటు విజయాలకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, అ..ఆ.. లాంటి చిత్రాలు నితిన్ మార్కెట్ ని పెంచుతూ వచ్చాయి. ప్రస్తుతం నితిన్ కు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉంది. మరి ‘భీష్మ’తో నితిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.