నగరంలో స్థానికంగా జరిగిన తనిఖీలలో కుషాయిగూడలోని ఓ చౌరస్తాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇన్నోవా వాహనం రాగా దానిని తనిఖీ చేశారు. తనఖీలో పోలీసులకు విస్తుపోయే నిజం తెలిసింది. ఆ వాహనం పేరిట 75 చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు తేలింది. 75 చలాన్లకు గానూ పోలీసులు వాహనదారుడి నుంచి 76 వేల 425 రూపాయలను మీ-సేవాలో కట్టించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. వాహనాలను అన్ని నియమాలు పాటించి నడపాలని అన్నారు. అవి అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని వారు తెలిపారు. చలానాలు కూడా సమయానికి చెల్లించనిచో, అదనపు జరిమానా విధించే అవకాశం ఉందని వాహనదారులు గమనించాలని వారు సూచించారు.