ఒకటే స్మార్ట్ కార్డుతో దేశంలోని అన్ని నగరాల్లోని మెట్రోరైళ్లలో ప్రయాణానికి వీలుగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ‘ఒన్ నేషన్ ఒన్ కార్డు’ నినాదంతో కేవైసీ గుర్తింపు డెబిట్, క్రెడిట్ కార్డుల తరహాలో మెట్రోరైళ్లలో ప్రయాణానికి ఒకటే కార్డును తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది.
దేశంలోని ప్రయాణికులకు ఆధార్ కార్డు, విదేశీయులకు వారి పాస్ పోర్టు ఆధారంగా మెట్రో రైలు ప్రయాణ కార్డులు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కొత్త కార్డును ఆరునెలల్లోగా ప్రవేశపెట్టాలని కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ మెట్రోరైలు విభాగాలను ఆదేశించింది. ఈ కార్డు క్యూఆర్ కోడ్ సాయంతో వచ్చే పేపరు స్లిప్పులు పొంది ప్రయాణించవచ్చు.