రోజు ఈ ప్రపంచంలో ఎన్నో వింతలూ విడ్డురలు జరుగుతున్నాయి. అవన్నీ ఇప్పటి సైన్స్ కు అందకపోయినా, నిజం అని నమ్మేవాళ్ళు ఈ దేశంలో బోలెడుమంది. అలాంటి విచిత్రాలలో.. ఇంకోటి.. ఒక్క కోడి తో 40వేల ఆదాయం.. తెస్తుందంటే, అది ఖచ్చితంగా బంగారు కోడే అవుతుంది కదా. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవునితిర్మలాపూర్కు చెందిన రామకృష్ణాచారి పెంచుకొన్న కోడికి ఇది పుట్టింది.
మొదటి విడత వరుసగా 30 రోజులు 30 గుడ్లు పెట్టగా పొదిగేస్తే 25 పిల్లలు, రెండో విడతలో వరుసగా 50 రోజులు పెట్టిన 50 గుడ్లను పొదిగేయగా 45 పిల్లలు పుట్టాయని రామకృష్ణాచారి తెలిపారు. ఇలా ఆ కోడి ఇప్పటి వరకు 150కి పైగా గుడ్లు పెట్టిందని చెప్పారు. ఈ కోడి పెట్టిన గుడ్లు, పొదిగిన పిల్లలు పెద్దవయ్యాక అమ్మడం ద్వారా ఇప్పటి వరకు సుమారు రూ.40 వేల వరకు ఆదాయం పొందినట్లు ఆయన చెప్పారు. వరుసగా 30 నుంచి 50 గుడ్ల వరకు పెట్టడంపై కొల్లాపూర్ పశువైద్యాధికారి డా.వినయ్కుమార్ మాట్లాడుతూ.. హార్మోన్ల ప్రభావంతో కొన్ని కోళ్లు ఇలా గుడ్లు పెట్టే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఫ్రీ భోజనం కోసమే ప్రెస్ మీట్లకు..జర్నలిస్టులపై కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు