telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ సినిమా వార్తలు

“నువ్వు అనుకుంటే అవ్వుద్ది స్వామి…” అసెంబ్లీలో పేలుతున్న సినిమా డైలాగులు

Padmavathy

ఒకవైపు ఏపీ రాజధానిపై వివాదం కొనసాగుతుండగా… మరోవైపు అసెంబ్లీలో సినిమా డైలాగ్‌లు పేలుతున్నాయి. అధినేతను ప్రసన్నం చేసుకోవడంలో భాగంగా… నేతలు తమ పొగడ్తలతో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. గురువారం నాడు ఇంగ్లీష్ మీడియంపై అసెంబ్లీ చర్చలో భాగంగా మాట్లాడిన శింగనమల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. జగన్‌ను మహేష్ బాబుని చేసేశారు. ‘ఖలేజా’ సినిమాలోని నువ్ అనుకో సామీ అయిపోద్ది డైలాగ్‌ను జగన్‌కు అన్వయిస్తూ ‘సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏదైనా అనుకుంటే దానిని చేసి తీరుతారని’ తెలియజేస్తూ.. ‘నువ్వు అనుకుంటే అవ్వుద్ది స్వామి.. నీ నవ్వు వరం.. నీ కోపం శాపం. నీ మాట శాసనం’ అంటూ త్రివిక్రమ్ డైలాగ్‌ను గుర్తు చేశారు. ఇక ప్రతిపక్షనాయకుడు చంద్రబాబుపై విమర్శల్లోని సూపర్ మహేష్ బాబు డైలాగ్‌ను వాడేశారు. చంద్రబాబుకు అమరావతి పేరుతో డ్రామాలు ఆడుతున్నారని.. ఆయన డ్రామాలు ‘నెవ్వర్ బిఫోర్‌.. ఎవ్వర్ ఆఫ్టర్‌’ అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని పాపులర్ డైలాగ్‌ను గుర్తు చూసి ఛలోక్తులు విసిరారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పట్లో సినీ నటి రోజా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత’లోని టార్చ్ బేరర్‌ డైలాగ్‌ను జగన్‌కి అన్వయించి అదరగొట్టగా.. రీసెంట్‌గా మంత్రి పుష్ఫశ్రీవాణి ‘రామసక్కని సీత’ సీరియల్‌లోని బియ్యం పాయసం డైలాగ్‌తో ఓ రేంజ్‌లో పొగడ్తల వర్షం కురిపించారు.

Related posts