telugu navyamedia
ఆరోగ్యం

ఎసిడిటీతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలు మీకోసం

ఇదివరకు ఏం తిన్నా అరాయించుకునే వాళ్లు. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. చాలా మందికి ఏదైనా కాస్త తినగానే తేన్పులు, ఆవలింతలు, గ్యాస్ వంటివి వస్తుంటాయి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. ఇది క్రమంగా ఛాతీలో భరించలేని మంటకు దారితీయడంతో పాటు గొంతు అంతా మండినట్లుగా అనిపిస్తుంది. ఈ లక్షణాలనే ఎసిడిటీ అంటారు.

ఎక్కువగా తినడం, సమయం కాని సమయంలో తినడం, భోజనాల మధ్య ఎక్కువ గ్యాప్​ పాటించడం వల్ల ఈ సమస్య తీవ్రమవుతుంది. మరోవైపు, ఒత్తిడితో కూడిన జీవనశైలి, హానికరమైన ఆహారం వంటి అనేక అంశాలు ఎసిడిటీకి దారితీస్తాయి. అయితే కొన్ని సాధారణ జీవనశైలి మార్పులతో ఎసిడిటీని నివారించవచ్చు.

* ఎక్కువగా కారం, పులుపు, ఉప్పు, పులియబెట్టిన, వేయించిన, ఫాస్ట్ ఫుడ్ తినడాన్ని మానుకోండి.
* ఏ ఆహారమైనా సరే సమతుల్యంగా తినండి.
* పుల్లని పండ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.


* ఎక్కువ గంటలు ఆకలితో ఉండకండి. భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ గ్యాప్​ పాటించకండి.
* రోజూ క్రమ పద్ధతిలో టైమ్​ ప్రకారం తినడం అలవాటు చేసుకోండి.
* రాత్రి పడుకునే సమయంలో తినకండి. పడుకోవడానికి కనీసం గంట ముందు డిన్నర్​ చేయండి.
* మీ కూరల్లో అధిక మొత్తంలో వెల్లుల్లి, ఉప్పు, నూనె, మిరపకాయలు లేకుండా చూసుకోండి. మాంసాహారం ఎక్కువగా తినకపోవడమే మంచిది.
* ధూమపానం, ఆల్కహాల్, టీ, కాఫీ, ఆస్పిరిన్ వంటి తరచూ తీసుకోవడం మానుకోండి.
* ప్రతి రోజూ కొన్ని కొత్తిమీర వాటర్​ తాగండి.
* భోజనం తర్వాత అర టీస్పూన్ సోంపు గింజలను నమలండి.
* మధ్యాహ్నం సమయంలో కొబ్బరి నీళ్లు లేదా షర్బత్ రసం తాగండి.
* ఖాళీ కడుపుతో కొన్ని నానబెట్టిన ఎండుద్రాక్షలను తినండి.
* నిద్రవేళలో 1 టీస్పూన్ ఆవు నెయ్యితో గోరువెచ్చని పాలు తీసుకోండి. ఇది మీ నిద్రలేమి, మలబద్ధకానికి చెక్​ పెడుతుంది.
* తగినంత విశ్రాంతి తీసుకోండి, తగినంత నీరు తాగండి. మంచి నిద్ర, యోగా, ప్రాణాయామం, ధ్యానం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

Related posts