అమెరికాలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన ఓ సిక్కు కుటుంబాన్ని సిన్సిన్నాటిలో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కాల్చి చంపారు. వివరాల్లోకి వెళితే.. సిన్సినాటి సబర్బ్ ప్రాంతంలోని ఓహియో అపార్ట్మెంట్లో ఆదివారం ఉదయం నాలుగు మృతదేహాలు పడి ఉన్నాయి.
వీటిని గుర్తించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు.అక్కడికి చేరుకున్న పోలీసులు దుండగుల కాల్పుల్లో వీరు మరణించినట్లుగా ధ్రువీకరించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరి మరణం పట్ల స్థానిక సిక్కు పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాల్పులకు తెగబడ్డ నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వాళ్లు కూడా మనుషులే… బ్లడీ స్టుపిడ్ పోలీస్