telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“టేక్ మి టేక్ మి టు ఎడ్జ్” అంటున్న శృతి హాసన్… “ఎడ్జ్” ఆల్బమ్ రిలీజ్

Shruthi-Hasan

హీరోయిన్ శృతి హాసన్ తాజాగా తన ‘ఎడ్జ్’ ఆల్బమ్ రిలీజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. లాక్‌డౌన్ కారణంగా ఎక్కువగా ఖాళీ సమయం దొరకడంతో సంగీతంపైనే దృష్టి పెట్టిన శృతి హాసన్.. ‘ఎడ్జ్’ అనే మ్యూజిక్ ఆల్బ‌మ్ రెడీ చేసింది. ఈ ఆల్బమ్ కోసం లిరిక్స్ రైటింగ్ మొదలుకొని సాంగ్ కంపోజింగ్, మ్యూజిక్ అన్నీ తానై చూసుకుంది శృతి హాసన్. తాజాగా ఈ ఆల్బమ్ రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుంచిన ఆమె.. ‘ప్ర‌తి ఒక్క‌రిలో అసంపూర్ణ‌మైన ప్రేమ‌ను తెలియ‌జేప్పే ప్ర‌య‌త్న‌మే ఇది’ అని పేర్కొంది. ఈ వీడియోలో ”టేక్ మి టేక్ మి టు ఎడ్జ్” అంటూ ఆకట్టుకుంది శృతి. ఈ బ్యూటీ హీరోయిన్ కావ‌డానికి ముందు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గానే వ‌ర్క్ చేసింది. ఆ తర్వాత కెమెరా ముందుకొచ్చి స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తనకిష్టమైన మ్యూజిక్‌పై నిత్యం ఫోకస్ పెడుతూనే ఉంది. ఇక ప్రియుడు మైకేల్ కోర్స‌లేతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన శృతి హాసన్ కొన్ని రోజులపాటు సినిమాలకు దూరంగా ఉంది. రీసెంట్‌గా అతనితో బ్రేకప్ చేసుకొని తిరిగి కెమెరా ముందుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ.. క్రాక్ సినిమాలో రవితేజ సరసన నటించింది. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌లో బి. మధు నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ లాక్‌డౌన్ తరువాత విడుదల కానుంది.

Related posts