వెంకటేష్ ఇప్పుడు “వెంకీ మామ” చిత్రంతో బిజీగా ఉండగా, ఈ సినిమా తర్వాత తమిళంలో సూపర్ హిట్ అయిన “అసురన్” సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నారు. అసురన్ చిత్రం వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్, మంజు వారియర్ ప్రధాన పాత్రలలో యాక్షన్ డ్రామాగా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రీమేక్ ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. చిత్రాన్ని ఓంకార్ డైరెక్ట్ చేయనున్నాడని ఓ టాక్ నడుస్తుంది. ఇందులో కథానాయికగా శ్రియని ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. తాజాగా చక్కర్లు కొడుతున్న రూమర్లో నిజమెంత ఉందనేది చూడాలి మరి. విక్టరీ వెంకటేష్, అందాల భామ శ్రియ శరన్ జంటగా తెరకెక్కిన సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించాయి. ఇప్పుడు ఈ జంట ముచ్చటగా మూడోసారి జతకట్టేందుకు సిద్దమయ్యారు.
previous post