ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక్కరోజు ముఖ్యమంత్రిగా సృష్టి గోస్వామి అనే యువతికి బాధ్యతలు అప్పగించనున్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుకున్నారు సీఎం త్రివేంద్ర సింగ్ రావత్. సీఎం నిర్ణయంతో సృష్టి గోస్వామి ఒక్కరోజు విధులు నిర్వహించనుంది. సృష్టి గోస్వామి హరిద్వార్ జిల్లా దౌలత్పూర్ గ్రామం. ప్రస్తుతం ఈ యువతి బీఎస్సీ డిగ్రీ చదువుతోంది. 2018లో ఉత్తరాఖండ్ బాలల అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించింది. జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా సృష్టి గోస్వామికి ఒక్కరోజు సీఎంగా ఛాన్స్ కొట్టేసి.. బాధ్యతలు నిర్వహించనుంది.
previous post
మహాత్మాగాంధీని హత్య చేసిన వారే నాపై దాడి- ఓవైసీ