telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

శ్రీశైలంలో హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ఆందోళన: ఎమ్మెల్యే రాజాసింగ్

BJP-MLA Raja-Singh

శ్రీశైలంలోని షాపింగ్ కాంప్లెక్స్ వేలం పాటలు సవ్యంగా జరగలేదని ఆరోపణలు వెల్లువిరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం ఆలయాన్ని పరిరక్షించుకోవాలని పిలుపు నిచ్చారు. రేపు శ్రీశైలంలో హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించనున్నట్టు ప్రకటించారు. శ్రీశైలంలో షాపులను ఓ వర్గం వారికే కేటాయించారని ఇది కరెక్టు కాదని అన్నారు.

వేలం పాటల పై వచ్చిన ఆరోపణలపై శైలం ఈవో శ్రీరామచంద్రమూర్తి వివరణ ఇస్తూ శ్రీశైలంలోని షాపింగ్ కాంప్లెక్స్ వేలం పాటలు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే జరిగాయని, డీడీలు పరిశీలించి అన్యమతస్తుల దరఖాస్తులను అనుమతించలేదని స్పష్టం చేశారు.శ్రీశైలంలో సెక్షన్ 30 అమలులో ఉందని, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించేందుకు వీలు లేదని పోలీసులు తెలిపారు. ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు తెలిపితే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు.

Related posts