హత్యలకు, అఘాయిత్యాలకు కెరాఫ్ అడ్రస్గా మారిపోయింది ఉత్తర ప్రదేశ్. యూపీలో మామూలు ప్రజలకు ఎలాంటి భద్రత లేకుండా పోయింది. తాజాగా యూపీలో మరో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఇంటికి నిప్పంటించి ఓ జర్నలిస్టును సజీవ దహనం చేశారు. ఈ ఘటనలో యూపీలోని బలారాంపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. బలరాంపూర్ పట్టణంలోని స్థానిక జర్నలిస్టు రాకేష్ సింగ్ తన స్నేహితుడు నిర్బీక్ తో కలిసి ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో ఆగంతకులు ఇంటికి నిప్పంటించి జర్నలిస్టు రాకేష్ సింగ్తో పాటు అతని స్నేహితుడిని సజీవదహనం చేశారు. ఈ ఘటన జరిగినప్పుడు జర్నలిస్ట్ భార్య, పిల్లలు వారి బంధువుల ఇంట్లో ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు హుటాహుటిన వచ్చి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. మరణించిన జర్నలిస్ట్ కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కును జిల్లా అధికారులు మృతుడి భార్యకు అందించారు. బలరాంపూర్ షుగర్ మిల్లులో జర్నలిస్టు భార్యకు ఉద్యోగం ఇస్తామని అధికారులు ప్రకటించారు. అయితే… ఈ కేసును దర్యాప్తు చేసేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
previous post