telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యంగ్ హీరో రాజ్ తరుణ్ సంచలన నిర్ణయం

Raj-Tarun

యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ మధ్య కాలంలో పూర్తిగా సక్సెస్ ట్రాక్ తప్పాడు. దీనితో రాజ్ తరుణ్ తన మార్కెట్ కోల్పోయాడు. ఇక రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా కూడా రాజ్ కి చేదు అనుభవాన్ని మిగిల్చింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు ప్రభావం కూడా చూపకపోవడం గమనార్హం. కెరీర్ లో డజనుకు పైగా సినిమాలు చేసినా స్టార్డమ్ అందుకోలేక పోయాడు హీరో రాజ్ తరుణ్. ఇప్పుడు రాజ్ తరుణ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. చిన్న సినిమాల హీరోగా కొనసాగుతున్న రాజ్ తరుణ్‌ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే రాజ్ తరుణ్ వీటన్నిటిని వదులుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సురేశ్ బాబు నిర్మాతగా వ్యవహరించనున్న ‘డ్రీమ్ గర్ల్’ తెలుగు వెర్షన్ రీమేక్ నుండి కూడా రాజ్ తప్పుకున్నాడట. ఇప్పటికే ఈ చిత్రం ట్రయ‌ల్‌ షూట్‌తో పాటు షెడ్యూలింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇలాంటి దశలో రాజ్ తరుణ్ ఈ సినిమా నుండి కూడా తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ‘డ్రీమ్ గర్ల్’ ఒరిజినల్ వెర్షన్ లో హీరో పాత్ర లేడీ వాయిస్ తో మాట్లాడుతుంటోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో అలాంటి సాహసం చేయలేకనే రాజ్ తరుణ్ బ్రేక్ తీసుకున్నట్టు సమాచారం. కాస్త గ్యాప్ తీసుకొని, అన్నీ విషయాలను ఆలోచించుకొని ఫ్రెష్ గా కెరీర్ ని రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాడట ఈ హీరో. మరి సెకండ్ ఇనింగ్స్ లోనైనా ఈ యంగ్ హీరో మంచి విజయాలను సొంతం చేసుకుంటాడేమో చూడాలి.

Related posts