కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో అందాల భామలు మాత్రం తమ హాట్ ఫొటోలతో రకరకాల ఛాలెంజ్ లతో వీడియోలతో అభిమానులను అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఖాళీగా ఉండతంతో టిక్ టాక్ యాప్ కు క్రేజ్ మాత్రం భారీగా పెరిగింది. సామాన్యులు సెలబ్రెటీలు అంతా టిక్ టాక్ లు చేస్తూ టైం పాస్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ భామ శిల్పాశెట్టి కూడా అదే పని చేసింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాలోని ‘సామజవరగమనా’ పాటకు టిక్ టాక్ చేసింది. అయితే ఆ టిక్ టాక్ వీడియోలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, పంజాబీ, గుజరాతీ, హిందీ ఇలా ఏడు భాషల్లోని ఫేమస్ సాంగ్స్ ను ఆలపించింది. శిల్పాశెట్టి చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
previous post
మహేష్ తో సినిమా… పూరీ సంచలన వ్యాఖ్యలు