శిల్పా శెట్టి భర్త, బిజినెస్ మెన్ రాజ్ కుంద్రా మరోసారి చిక్కుల్లో పడ్డారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనకి సమన్లు జారీ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. 2013లో చనిపోయిన గ్యాంగ్స్టర్ ఇక్బాల్ మిర్చికి సంబంధించిన కేసులో రాజ్ కుంద్రాపై ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రాజ్ కుంద్రాను విచారించేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. రంజీత్ బింద్రా, బాస్టియన్ హాస్పిటాలిటీ అనే సంస్థతో కుంద్రాకు ఉన్న లావాదేవీలను కూడా పరిశీలిస్తోంది. ఇటీవల వీరిద్దరి మధ్య కొన్ని వ్యాపార లావాదేవీలపై కీలక సమాచారం అందిన క్రమంలో సమన్లు జారీ చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో రాజ్ కుంద్రా స్టేట్ మెంట్ ను రికార్డు చేయాల్సి ఉన్నందున ముంబైలోని విచారణ అధికారుల ఎదుట హాజరు కావాలని నోటిసులిచ్చినట్లు తెలిపారు.
previous post