స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘అల వైకుంఠపురములో’ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఇండస్ట్రీ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల ఈ చిత్రం ‘బాహుబలి 2’ రికార్డులను కూడా బ్రేక్ చేయడం విశేషం. ఈ సినిమాలోని పాటలు ఎంతగా హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ‘బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా నన్ను సుట్టూ కుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే’ అంటూ సాగే మెలోడీ సాంగ్ ఆడియన్స్ని ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. తమన్ తనదైన శైలిలో సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించగా.. అర్మాన్ మాలిక్ ఆలపించారు. సినిమా సక్సెస్లో కీ పాత్ర పోషించిన ఈ సాంగ్ టిక్ టాక్లో మరింత ఫేమస్ అయ్యింది. తమిళనాడు, కేరళ, బెంగాలీ భాషల్లో ఈ సాంగ్ను టిక్ టాక్ చేశారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా ఈ సాంగ్ను టిక్ టాక్ చేసి పోస్ట్ చేశారంటే.. ఈ సాంగ్ ఏ రేంజ్లో వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ బన్నీ వేసిన స్టెప్స్ వేసి ఆమె అలరించారు. బుట్టబొమ్మ సాంగ్కి టిక్ టాక్లో దాదాపు 4.6 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.
previous post
next post