ఐపీఎల్ 2020 లో ఈ రోజు దుబాయ్లో రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ టీ 20 క్రికెట్లో 7500 పరుగులు పూర్తి చేసిన ఇండియన్ ప్లేయర్స్ జాబితాలో చేరాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేష్ రైనా తర్వాత ఈ మార్క్ అందుకున్న భారత నాలుగో బ్యాట్స్మాన్ ధావన్ అయ్యాడు. ఈ జాబితాలో 5 సెంచరీలతో 288 మ్యాచ్ల్లో 9156 పరుగులతో కోహ్లీ ఆధిక్యంలో నిలిచాడు. రోహిత్ 335 మ్యాచ్ లలో 6 సెంచరీలతో 8858 పరుగులతో ఉన్నాడు. అలాగే 6 సెంచరీలతో 329 మ్యాచ్ లలో 8392 పరుగులతో రైనా మూడో స్థానంలో ఉన్నాడు.
ఇక ధావన్ ఈ రోజు రాత్రి తన 267 వ మ్యాచ్ మరియు 264 వ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అయితే 7500 పరుగుల మైలురాయిని చేరుకున్న రెండవ వేగవంతమైన భారతీయుడిగా ధావన్ నిలిచింది. 2017 లో టీ 20 క్రికెట్లో 7000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయుడు కోహ్లీ. ఇక మొత్తంమీద, ధావన్ టీ 20 క్రికెట్లో 7500 పరుగులు పూర్తి చేసిన 15 వ బ్యాట్స్మాన్, కానీ ఈ జాబితాలో చేరి ఇప్పటివరకు ఒక సెంచరీ చెయ్యని రెండో ఆటగాడు. మొదట షోయబ్ మాలిక్ ఉన్నాడు. ధావన్ చేసిన 7500 పరుగులతో 1588 పరుగులు అంతర్జాతీయ క్రికెట్ లో టీమ్ ఇండియా తరపున అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 4785 పరుగులు సాధించాడు.
తమ కేబినెట్లో మంత్రులు హీరోలు: జగన్