కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా చర్యలను చేపడుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా షూటింగ్లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. పలువురు సెలబ్రిటీలు ప్రభుత్వాలకు విరాళాలను అందించడమే కాకుండా నైతికంగా తమ మద్దతుని తెలియజేస్తున్నారు. మరోవైపు సెలెబ్రెటీలకు కరోనా సోకిందంటూ ఫేక్ న్యూస్ లు ఎక్కువైపోతున్నాయి. తాజాగా తనకు, తన కుటుంబానికి కరోనా సోకిందని వస్తోన్న వార్తలను నటి షెఫాలి షా స్పందించారు.తన ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని, దాని ద్వారా తనకు కరోనా సోకిందంటూ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేశారంటూ తెలిపింది.అయితే తన ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటూ ఎంతో మంది మెసేజ్లు, కాల్స్ చేశారని వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
previous post