ఏషియన్ గ్రూప్ యూనిట్కు చెందిన శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి వరుసపెట్టి సినిమాలను ప్రకటిస్తోంది. తాజాగా యంగ్ హీరో శర్వానంద్తో ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నిర్మాతలు నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు మంగళవారం మీడియాకు తెలిపారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన డైరెక్టర్, తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు. శర్వానంద్ ప్రస్తుతం ‘శ్రీకారం’ చిత్రంతో పాటు ఒక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రాన్ని ఏక కాలంలో చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో శర్వానంద్ సరైన విజయం అందుకోలేకపోయారు. ‘శతమానం భవతి’ సినిమా తరవాత ఆ స్థాయి విజయం దక్కలేదు. ‘రాధ’ డిజాస్టర్ తరవాత ‘మహానుభావుడు’ పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత వరుసగా ‘పడిపడి లేచే మనసు’, ‘రణరంగం’, ‘జాను’ సినిమాలు నిరాశపరిచాయి. మరి రాబోయే సినిమాలు శర్వానంద్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తాయి చూడాలి. ఇదిలా ఉంటే… నిఖిల్ 20వ సినిమాని నిర్మించనున్నట్లు ఇటీవల ప్రకటించిన శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంస్థ.. ఒకదాని తర్వాత ఒకటిగా చిత్రాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. మరోవైపు నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరి’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ను ఏషియన్ సినిమాస్ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది.
ప్రభాస్తో కప్పు కాఫీ తాగినా చాలు: దివి