యంగ్ హీరో శర్వానంద్ ఇటీవలే “రణరంగం”తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో తన తరువాత ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు శర్వా. ఇప్పుడు శర్వానంద్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం “96” తమిళ రీమేక్లో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు తన 29వ చిత్రాన్ని కిశోర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇటీవల లాంచ్ అయిన ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. “శ్రీకారం” అనే టైటిల్తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయికగా ఎవరిని ఎంపిక చేసారనేది తెలియాల్సి ఉంది. ఇక తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై శ్రీకార్తీక్ దర్శకత్వంలో కొత్త చిత్రం బుధవారం చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీకార్తిక్ కు ఇదే మొదటి సినిమా. షూటింగ్ కూడా బుధవారం నుండే ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో `పెళ్ళిచూపులు` ఫేమ్ రీతూవర్మ హీరోయిన్గా నటిస్తుంది. నాజర్, వెన్నెలకిషోర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విడదీయలేని స్నేహం, ప్రేమ అనే అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెకకనుంది. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ సారంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. చెన్నైలో చిత్ర తొలి షెడ్యూల్ జరగనుంది.
next post
సిద్ధార్థ్ నన్ను వాడుకున్నాడు… కానీ… హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు