యువ హీరో శర్వానంద్ తాజాగా “96” రీమేక్ షూటింగ్ లో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న శర్వానంద్ “శ్రీకారం” అనే కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేశారు.ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లేను కిశోర్ రెడ్డి అందించగా.. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. మిక్కి జె.మేయర్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆగస్ట్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేసేలా ప్లాన్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో శర్వానంద్ పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. “శ్రీకారం”లో శర్వానంద్ రైతు పాత్రను పోషించబోతున్నారట. రైతుల కష్టనష్టాలను తెలిపేలా సినిమాను తెరకెక్కిస్తారట. అలాగే మంచి మెసేజ్ కూడా ఉంటుందని అంటున్నారు. అయితే శర్వానంద్ మెసేజ్ ను ప్రేక్షకులు ఎలా స్వాగతిస్తారో చూడాలి.
ఆ సినిమా వలన అప్పులపాలయ్యా