యంగ్ హీరో శర్వానంద్, కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ ప్రధాన పాత్రల్లో నటించిన “రణరంగం” సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం బాగా వచ్చాయి. శర్వానంద్ కెరీర్లో రికార్డు ఓపెనింగ్స్ అందించిన సినిమాగా “రణరంగం” నిలిచింది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. ఈ సినిమా ఫలితం గురించి తాజాగా శర్వానంద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. “రణరంగం బాగోలేదని ఎవరూ అనలేదు. అయితే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం నేను తికమకలో ఉన్నాను. తప్పు ఎక్కడ జరుగుతోందో అర్థం కావడం లేదు. సినిమా గురించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. చిత్రపరిశ్రమ నుంచి ఒకలాంటి ఫీడ్బ్యాక్ వస్తోంది. ప్రేక్షకులు ఒకలా చెబుతున్నారు. విమర్శకులు మరోలా మాట్లాడుతున్నారు. అందుకే తర్వాతి సినిమా ఎలా ఉండాలో నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాను” అని శర్వా అన్నాడు.
previous post