telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో కొత్త పార్టీ ! రేపే లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిల సమావేశం..

ys sharmila as ycp party working president

రేపు లోటస్‌పాండ్‌లో నివాసంలో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఉదయం పది గంటలకు అభిమానులతో షర్మిల సమావేశం కానున్నారు. వైఎస్ఆర్ అభిమానులు సమావేశానికి రావాల్సిందిగా ఫోన్లు చేసింది షర్మిల శిబిరం. షర్మిల కొత్త పార్టీ ఊహాగానాల వార్తలతో రేపటి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. షర్మిల సమావేశం వెనుక అజెండాను ఇంకా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టబోతున్నారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. అయితే రేపటి సమావేశంలో షర్మిల తీసుకునే నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. షర్మిల ఆత్మీయ సమ్మేళనానికే పరిమితం అవుతారా ? రాజకీయ పార్టీ ఏర్పాటుకు ప్రయత్నిస్తారా అన్నదానిపై రెండు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. అటు షర్మిల ఆత్మీయ సమ్మేళనంపై వైసీపీ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అభిమానులను కలిసేందుకు సమ్మేళనం అంటున్నారు షర్మిల సన్నిహితులు. రాజకీయ ప్రణాళిక లేదంటున్నారు షర్మిల సన్నిహితులు.

Related posts