telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జనం లేక షర్మిల సభ వెలవెల..ముందుకు కదలని బస్సు యాత్ర!

YS  Sharmila Social Media Case Hyderabad

ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ తరపున వైఎస్ షర్మిల బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో వైసీపీ అభ్యర్థి శ్రీనివాసనాయుడు తరఫున ప్రచారం చేసేందుకు వచ్చిన షర్మిలకు నిరాశ ఎదురైంది. సభా వేదిక వద్ద అనుకున్నంత మంది ప్రజలు లేరని తెలియడంతో తన కాన్వాయ్ ని 15 నిమిషాల పాటు నిలిపేశారు. దేవరాపల్లి నుంచి నిడదవోలుకు ఆమె బస్సు యాత్ర ప్రవేశించగా సంత మార్కెట్ రోడ్డులో కాన్వాయ్ నిలిచిపోయింది.

అప్పటికే స్థానిక పొట్టి శ్రీరాములు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు వెళ్లిన నాయకులు, జనాలు తక్కువగా ఉన్నారన్న విషయాన్ని కాన్వాయ్ కి చేరవేయగా ఆమె కాసేపు వేచి చూశారు. నగరంలోకి ప్రవేశించిన కాన్వాయ్ సభా స్థలికి సమయానికి చేరుకోకపోవడంతో కాసేపు అయోమయ వాతావరణం ఏర్పడింది. ఆపై వేదిక వద్దకు వచ్చి ప్రసంగించిన షర్మిల, వైఎస్ఆర్ పాలనను మరోసారి చూడాలంటే జగనన్నను సీఎం చేయాలని సూచించారు. ఏపీ సర్కారు అన్ని వర్గాలనూ విస్మరించిందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైసీపీని గెలిపించాలని కోరారు.

Related posts