భారీ బడ్జెట్ చిత్రాలతో భారీ సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దక్షిణాది దర్శకుడు శంకర్. తన టాలెంట్ తో తమిళ సినిమాకు భారీతనాన్ని అద్ది, భారీ బడ్జెట్తో సినిమాలు రూపొందించడమే కాకుండా అంతకు రెట్టింపు స్థాయిలో కలెక్షన్లు తిరిగి రాబట్టడం శంకర్ స్పెషాలిటీ. తమిళనాడులోని కోయంబత్తూర్లో పుట్టిన శంకర్ ప్రస్తుతం దేశంలోని అగ్రదర్శకులలో ఒకరు. ఆయన సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ స్టార్లు సైతం ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు నటుడవుదామని చెన్నైకి వచ్చిన శంకర్, అనుకోని పరిస్థితుల్లో దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ (స్టార్ హీరో విజయ్ తండ్రి) వద్ద అసిస్టెంట్గా చేరి “జెంటిల్మెన్” చిత్రంతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టాడు. ఆ తరువాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుసగా భారీ సినిమాలను రూపొందిస్తూ దక్షిణాది గర్వించదగ్గ దర్శకుడిగా ఎదిగాడు.
సినీరంగంలోకి శంకర్ అడుగుపెట్టి పాతికేళ్లు పూర్తవుతోంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని శంకర్ తాజాగా తమిళ దర్శకుల కోసం పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమంలో శంకర్తోపాటు దర్శకులు మణిరత్నం, గౌతమ్ మీనన్, పా రంజిత్, పాండిరాజ్, శంకర్ శిష్యులైన అట్లీ, బాలాజీ శక్తివేల్, వసంతబాలన్ వంటి దర్శకులు కూడా హాజరయ్యారు. ఈ పార్టీలో పాల్గొన్న సందర్భంగా వీరందరూ కలిసి తీసుకున్న సెల్ఫీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అంతా నా విగ్రహాలు పెట్టుకోవాలి : నటి హేమ